byసూర్య | Fri, May 10, 2024, 01:56 PM
కరీంనగర్ పట్టణానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బోయినపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 46 వ డివిజన్ బి. జె. పి. నాయకులు అక్కెనపల్లి రాజు వారి అనుచరులతో కలిసి శుక్రవారం కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సమక్షంలో బి. ఆర్. ఎస్. పార్టీలో చేరినారు. పార్టీలో చేరిన 100 మంది నాయకులకు ఎమ్మెల్యే గంగుల గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.