ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే

byసూర్య | Sat, Apr 27, 2024, 09:08 PM

దేశంలో ప్రస్తుతం ఓట్ల పండగ నడుస్తోంది. మెుత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. ఇక ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను.. ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లినవారు స్వగ్రామాలకు చేరుకుంటారు. దీంతో బస్సులు, ట్రైన్లు కిక్కిరిపోసుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. వేసవి రద్దీతో పాటు ఎన్నికలకు వెళ్లేవారి కోసం స్పెషల్ ట్రైన్లను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి ఈ స్పెషల్ ట్రైన్లు నడుస్తున్నాయి.


గతంలో ఎన్నడూ లేని విధంగా దానాపూర్‌కు 22 ప్రత్యేక ట్రైన్లు నడుపుతున్నారు. సికింద్రాబాద్‌ నుంచి 11 ట్రైన్లు వెళ్తున్నాయి. ఇవన్నీ ప్రతి గురువారం నగరం నుంచి బయలుదేరుతున్నాయి. అలాగే అటునుంచి ఇంతే సంఖ్యలో ప్రతి శనివారం తిరుగు ప్రయాణమవుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే ఈ ట్రైన్లనీ అన్‌రిజర్వ్‌డ్‌ అని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ప్రతి రోజూ నడిచే సికింద్రాబాద్‌ - దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెయిటింగ్‌ లిస్ట్‌ జాబితా ఉన్నందున క్లోనింగ్‌ ట్రైన్ల మాదిరి వీటిని నడుపుతున్నారు. ఇదే ట్రైన్లలో అయోధ్యకు వెళ్లే భక్తులు కూడా తోడయ్యారు.


సికింద్రాబాద్‌ - సంత్రగాచి - సికింద్రాబాద్‌ మధ్య 42 ట్రైన్లు, కాచిగూడ - కోచువెలి - కాచిగూడ మధ్య 4 స్పెషల్ ట్రైన్లు అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్‌ - ఆరిస్కరా మధ్య 38 స్పెషల్ ట్రైన్లను అధికారులు నడుపుతున్నారు. మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల్‌, కర్నూలు సిటీ, డోన్‌, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్‌ మీదుగా కర్ణాటకకు ఈ ట్రైన్లు నడుస్తున్నాయి. ఇలా సికింద్రాబాద్‌ - దానాపూర్‌, హైదరాబాద్‌ - గోరఖ్‌పూర్‌, కాచిగూడ - కోచువెలి, సికింద్రాదాద్‌ - అగర్తల, తిరుపతి - షిర్డీ, కాచిగూడ - మధురై, సికింద్రాబాద్‌ - కొళ్లం, హైదరాబాద్‌ - కటక్‌, హైదరాబాద్‌ - రాక్సౌల్‌, సికింద్రాబాద్‌ - సంత్రగాచి, సికింద్రాబాద్‌ - షాలీమర్‌, సికింద్రాబాద్‌ - పాట్నా ఇలా ఇతర రాష్ట్రాలను కలుపుతూ స్పెషల్ ట్రైన్లు నడుస్తున్నాయి.


సికింద్రాబాద్‌ - తిరుపతి, లింగంపల్లి - కాకినాడ, హైదరాబాద్‌ - నర్సాపూర్‌, సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మధ్య కూడా ప్రత్యేక ట్రైన్లు ఉన్నాయి. ఇలా మొత్తం 1079 ప్రత్యేక ట్రైన్లను సౌత్ సెంట్రల్ రైల్వే నడుపుతోంది. తెలంగాణలో ఎక్కువ మంది ఉత్తర భారతదేశానికి చెందినవారుండడంతో దానాపూర్‌, గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లను ఎక్కువ సంఖ్యలో వేశారు. ఇక ఉత్తరాంధ్ర మీదుగా వెళ్లే విశాఖ, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లకు తోడు అదే మార్గంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలకు కూడా ప్రత్యేక ట్రైన్లు నడుపుతున్నారు.


Latest News
 

అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన 'వండర్‌లా'.. ఆ 3 రోజులపాటు వాళ్లందరికీ డిస్కౌంట్ Fri, May 10, 2024, 09:08 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్‌ నుంచి స్పెషల్ ట్రైన్స్, పూర్తి వివరాలివే Fri, May 10, 2024, 09:04 PM
'జేబులో రూ.150తో హైదరాబాద్ వచ్చా'.. పొలిటికల్ జర్నీపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Fri, May 10, 2024, 08:59 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు Fri, May 10, 2024, 08:55 PM
మీ తోపు అందుకే ఇంకా కళ్లముందున్నాడు, లేకపోతేనా.. ఒవైసీ‌కి నవనీత్ కౌర్ కౌంటర్ Fri, May 10, 2024, 08:52 PM