byసూర్య | Sat, Apr 27, 2024, 07:07 PM
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల్లో వేసవి తీవ్రత కొనసాగుతుంది. శనివారం నియోజకవర్గం వ్యాప్తంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి తాపంతో రోజువారి కూలీలు, రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు రావడానికి భయపడే పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో పనులు చేయాల్సిన వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.