byసూర్య | Sat, Apr 27, 2024, 07:04 PM
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో శనివారం ట్రేడ్ యూనియన్ అనుబంధ సంఘాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు ఆర్. శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా కార్మికులకు ఎనిమిది గంటల పని దినాలు కల్పించిన మేడే ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అనుబంధ సంఘాల ముఖ్యనాయకులు పాల్గొన్నారు.