byసూర్య | Sat, Apr 27, 2024, 06:50 PM
ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు పిన్నంచర్ల గ్రామంలో పోలింగ్ స్టేషన్ లను శనివారం అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, బెంచిలను సిద్ధం చేయాలని అన్నారు. బిఎల్ఓ లు చేపట్టిన ఓటరు స్లిప్ పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ప్రతి ఓటరుకు స్లిప్ అందించాలని చెప్పారు.