byసూర్య | Sat, Apr 27, 2024, 06:47 PM
జ్యోతిబా పూలే బిసి కళాశాలలో ప్రవేశాల కొరకు ఆదివారం నారాయణపేటలో నిర్వహించే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో మహమ్మద్ అబ్దుల్ ఘని అన్నారు. శనివారం ఎంఆర్సీ భవనంలో పరీక్ష కేంద్రాల ప్రిన్సిపాల్స్ తో సమావేశం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12: 30 వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. అయిదు పరీక్ష కేంద్రాలలో 1008 విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.