byసూర్య | Sat, Apr 27, 2024, 06:39 PM
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ పరిశీలించారు. మాడ్గులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ మండలంలోని పోలింగ్ కేంద్రాలతో పాటు శెట్టిపాలెం చెక్పోస్టు పరిశీలించాడు. అనంతరం మిర్యాలగూడ ప్రభుత్వకళాశాల స్ట్రాంగ్ రూమ్ డీఆర్సీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డివో జీ. శ్రీనివాస్ రావు తహసీల్దార్ హరి బాబు తదితరులు ఉన్నారు.