byసూర్య | Sat, Apr 27, 2024, 06:32 PM
మిర్యాలగూడలో రంగులు మారుతున్న రాజకీయం ఆసక్తిగా మారింది. మొన్నటి వరకు బీ ఆర్ఎస్ లో పదవులు అనుభవించిన కొందరు అధికారం పోగానే కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు. దీంతో పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణప్రజలు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలువురు వార్డు కౌన్సిలర్లు శనివారం కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసి గోడదూకే నాయకుల తీరును మహిళలు పేడతో కొట్టి చెప్పుదండలు వేసి నిరసన తెలిపారు.