byసూర్య | Sat, Apr 27, 2024, 06:23 PM
అద్దె బకాయిలు చెల్లించి ఈఎస్ఐ ఆసుపత్రికి సొంత భవనం నిర్మించాలని సిఐటియు రాష్ట్ర నాయకులు దబ్బికార్ మల్లేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సంఘం ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఎదుట ధర్నాచేసి మాట్లాడారు. ఉచిత వైద్యసేవలు అందించాల్సిన ఈఎస్ఐ ఆసుపత్రికి సొంత భవనంలేక వేలాదిమంది కార్మికులు అసౌకర్యానికి గురవుతున్నారని, తక్షణమే సొంత భవనం నిర్మించి పూర్తిస్థాయి సౌకర్యాలతో వైద్యులను అందుబాటులో ఉంచాలని కోరారు.