byసూర్య | Sat, Apr 27, 2024, 06:21 PM
నల్గొండలో కుటుంబ పాలన పోవాలంటే బీజేపీకే పట్టం కట్టాలని నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆళ్లగడ్డ గ్రామ కార్నర్ మీటింగ్ లో శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ మనకు ముఖ్యమని దేశం కోసం మోడీని గెలిపించాలన్నారు. ఈసారి మోడీకి 400 సీట్లు రాబోతున్నాయని అందులో మన నల్గొండ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. యువతకు 50 వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. నల్లగొండలో కుటుంబ పాలన పోవాలంటే భారతీయ జనతా పార్టీకే ఓటు వేయాలని కోరారు.