byసూర్య | Thu, May 09, 2024, 10:36 AM
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం భువనగిరి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.ఉదయం 9 గంటలకు భువనగరిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొంటారు. 11న వికారాబాద్, వనపర్తిల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో షా పాల్గొంటారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్యాదవ్, గురువారం ఉదయం 10 గంటలకు మెదక్ పార్లమెంటు పరిధిలోని నర్సాపూర్లో పార్టీ అభ్యర్థి రఘునందన్రావు తరపున ప్రచారం నిర్వహించనున్నారు.