byసూర్య | Thu, May 09, 2024, 11:40 PM
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను రేపు కోర్టు విచారించనుంది. బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత రూస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆమె బెయిల్ పిటిషన్ను ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తరపున న్యాయవాదులు గురువారం పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒకరు కాబట్టి ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని రోస్ అవెన్యూ కోర్టును అభ్యర్థించారు.