byసూర్య | Thu, Apr 25, 2024, 01:06 PM
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను గురువారం మంత్రి జూపల్లి కృష్ణారావు, లోక్ సభ అభ్యర్థి మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం ఆలయ సమీపంలో ఉన్న దర్గాను దర్శించుకున్నారు.