byసూర్య | Thu, Apr 25, 2024, 01:04 PM
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ను గెలిపించాలని ఆ పరాయి మండల అధ్యక్షులు సాయిబన్న ప్రజలను కోరారు. గురువారం నారాయణపేట మండలం బైరంకొండ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కొరకు బీజేపీ ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రధాని మోడీ పేద ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, మళ్ళీ ప్రధానిగా గెలిపించాలని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.