byసూర్య | Sat, May 04, 2024, 03:38 PM
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కి మద్దతుగా బీజేపీ యువ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. అనంతరం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఉపాధిహామీ కూలీల వద్దకు వెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బండి సంజయ్ ని గెలిపియాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు గండవేన అఖిల్, చేపూరి శ్రీకాంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.