byసూర్య | Sat, May 04, 2024, 03:44 PM
గోదావరిఖని ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్య మంత్రి సింగరేణి కార్మికుల మీద కపట ప్రేమ చూపించి కాంగ్రెస్ పై అసత్య ఆరోపణలు చేయడాన్ని శనివారం ఐఎన్ టియు సి సెక్రెటరీ జనరల్ ప్రసాద్ తప్పుబట్టారు. కెసిఆర్ హయంలోనే కోయాగుడెం ప్రవేటు వ్యక్తులకు ఇచ్చారని. ప్రభుత్వం సింగరేణి అధికారులతో సమీక్షలు చేశారని గుర్తుచేశారు. కోల్ బెల్ట్ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.