byసూర్య | Sat, May 04, 2024, 03:45 PM
సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో శనివారం ఉదయం జహీరాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ తరఫున మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి సురేశ్ షేట్కార్, పురపాలక సంఘం మాజీ చైర్మన్ మంకాల్ సుభాష్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నాయకులు పలువురు పాల్గొన్నారు.