byసూర్య | Sat, May 04, 2024, 03:27 PM
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగేల గోండు గూడెం గ్రామానికి చెందిన కొమురం సోము (58) అనే రైతు శనివారం వడదెబ్బతో మృతి చెందాడు. మృతుడు తన వ్యవసాయ భూమిలో ఉదయం నువ్వులు కోయడానికి వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. నీరసంగా ఉందంటూ పడుకున్నాడు. ఇంతలోనే భార్య నీళ్లు తాగుమని లేపేసరికి చనిపోయి ఉన్నాడని తెలిపారు. ప్రభుత్వం మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదివాసి నాయకులు కోరుతున్నారు.