byసూర్య | Thu, Apr 25, 2024, 12:59 PM
భక్తుల కొంగు బంగారంగా కొలిచే రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు సన్నద్ధం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ సమీపంలోని తుంగభద్ర నది మధ్యన వెలసిన రామప్ప స్వామి ఆలయంలో ఈనెల 29న ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీనికోసం అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం ఆలయాన్ని శుద్ధి చేశారు.