కనిష్ఠ వేతనం రూ.32 వేలు.. గరిష్ఠ వేతనం 2.95 లక్షలు.. టీజీవో ఉద్యోగుల డిమాండ్

byసూర్య | Sat, May 04, 2024, 07:32 PM

ఉద్యోగుల కనిష్ఠ వేతనం రూ.32 వేలు.. గరిష్ఠ వేతనం రూ.2,95,460 ఉండాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల (టీజీవో) సంఘం డిమాండ్ చేసింది. పే స్కేల్‌ నిర్ధారణకు ఆ పోస్టుకు సంబంధించిన కనీస వేతనం, 1-7-2023 నాటికి ఉన్న డీఏ, ఫిట్‌మెంట్‌ను కలిపి నిర్ధారించాలని సూచించింది. ఈ మేరకు రెండో పీఆర్సీ చైర్మన్‌ ఎన్‌.శివశంకర్‌కు టీజీవో సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో ఉద్యోగుల డిమాండ్లతో కూడిన నివేదికను శుక్రవారం అందించారు.


ఉద్యోగులపై పెట్టే ఖర్చును రెవెన్యూ వ్యయం పేరుతో అప్రాధాన్య ఖర్చుగా కాకుండా పెట్టుబడి వ్యయంగా పరిగణించాలి సంఘం నాయకులు కోరారు. ఫిట్‌మెంట్‌ 40 శాతం, వార్షిక ఇంక్రిమెంట్‌ రేటు 2.6 నుంచి 3 శాతం ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వంలో ఉద్యోగుల పాత్ర కీలకమని వారి న్యాయమైన డిమాండ్లకు పరిష్కార మార్గాలు చూపాలన్నారు. తమ విజ్ఞప్తులపై రెండో పీఆర్సీ చైర్మన్‌ ఎన్‌.శివశంకర్‌ సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.


Latest News
 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన Sat, May 18, 2024, 01:58 PM
ఈశ్వర్ కు ఆహ్వాన పత్రిక అందజేత Sat, May 18, 2024, 01:38 PM
తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ Sat, May 18, 2024, 12:33 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి Sat, May 18, 2024, 12:32 PM
అకాల వర్షాలు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి Sat, May 18, 2024, 12:29 PM