byసూర్య | Thu, Apr 25, 2024, 12:11 PM
నల్లగొండలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓటు చైతన్యంపై చిత్ర ప్రదర్శనను జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ప్రారంభించి మాట్లాడుతూ విద్యతో పాటు ఓటును కూడా ఉపయోగించుకొని మంచి నాయకుని ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ శ్రీనివాస్, డీఎంహెచ్ఓ కొండలరావు, ఫీడ్ పబ్లిసిటీ అధికారి కోటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ గన్ శామ్, విద్యార్థినిలు పాల్గొన్నారు.