byసూర్య | Thu, Apr 25, 2024, 12:08 PM
నల్గొండ పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా దేవరకొండ ప్రాంతానికి చెందిన ఉద్యమకారుడు, అడ్వకేట్ నూనె సురేష్ బుధవారం నల్గొండలో నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గం ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందని, దేవరకొండ, సాగర్, మునుగోడు, హూజుర్ నగర్, సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు రైలుమార్గం రావాల్సిన అవసరం ఉందని, రైతాంగ సమస్యల పరిష్కారం, ఉచిత విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం పోరాటం చేస్తానని సురేష్ అన్నారు.