byసూర్య | Thu, Apr 25, 2024, 12:04 PM
కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం స్టేజి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వర్టిగా కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుల వివరాలు, ప్రమాద ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.