byసూర్య | Sat, May 04, 2024, 02:44 PM
మహబూబ్ నగర్ ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 6న టి ఎస్ కే సి & ప్లేస్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో జాబ్ మేళ నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ ఎం. విజయకుమార్, టి ఎస్ కే సి కోఆర్డినేటర్ కళమ్మ, ప్లేస్మెంట్ కన్వీనర్ ఏ కేశవర్ధన్ గౌడ్, మెంటర్ స్వరూప శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్యూచర్ ప్రాపర్టీ, జెన్ టెక్నాలజీస్ తదితర పది కంపెనీలు ప్లేస్ మెంట్ కల్పిస్తాయని ఈ సందర్భంగా వారు తెలిపారు.