byసూర్య | Fri, Apr 19, 2024, 03:06 PM
బిజెపి పాలనలోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని కేంద్రంలో ప్రధాని మోదీ నిరూపించారని బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని తూంకుంట గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అంజి, నరసింహులు, ఖాజా, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.