byసూర్య | Fri, Apr 19, 2024, 03:04 PM
లోకసభ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చందర్ రెడ్డి నామినేషన్ పత్రాల దాఖలుకు సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా శుక్రవారం జడ్చర్ల డిగ్రీ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాట్లు చేయగా భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేసినట్టు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. జాతీయ రహదారి వెంట రానున్న సీఎంకు కొత్త బస్టాండు పైవంతెన కూడలి వద్ద నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలుకుతారని, అక్కడినుండి మహబూబ్ నగర్ కు చేరుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు.