byసూర్య | Fri, Apr 19, 2024, 03:01 PM
నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి బహుజన్ ముక్తి పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి గడ్డం విజయ్ గురువారం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బహుజనులను ఓటర్లుగా వాడుకొని అధికారం చెలాయిస్తున్నారని అన్నారు. బహుజనుల అభ్యున్నతిని కోరుకునే బీఎంపీని గెలిపించాలని కోరారు.