byసూర్య | Thu, May 02, 2024, 10:28 AM
మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం వేల బయటకు వెళ్లొద్దని సూచించింది. ఈ నెల 6 వరకు కర్ణాటక, ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని సూచించింది. మే 4 వరకు జార్ఖండ్లో.. మే 3 వరకు కేరళ, తమిళనాడులో ఎండల తీవ్రత ఉంటుంది. మే 5 వరకు పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్రలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.