byసూర్య | Fri, Apr 19, 2024, 02:55 PM
మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణమ్మ శుక్రవారం ఉదయం 10: 00 గంటలకు శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంనకు రానున్నారని బీజేపీ కౌకుంట్ల మండల అధ్యక్షులు సంఘాల రవీందర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని బిజెపి మండల కమిటీ, వివిధ మోర్చాల అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులతో పాటు, క్రియాశీలక కార్యకర్తలు, బీజేపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని, అరుణమ్మకు ఆహ్వానం పలికి, పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.