byసూర్య | Thu, May 02, 2024, 12:09 PM
దేశ భవిష్యత్తు కోసం పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రజలను కోరారు. గురువారం హన్వాడ మండలం పుల్పోని పల్లి గ్రామంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో మారేపల్లి సురేందర్ రెడ్డి, డిసిసి కార్యదర్శి టంకర కృష్ణయ్యతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. మహేందర్, పురుషోత్తం, శ్రీహరి, రాంచందర్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.