byసూర్య | Thu, May 02, 2024, 04:56 PM
అనుబంధ ర్యాండమైజేషన్ ను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఈవీఎం గోదాములో ఇటీవల హైకోర్టు ఆదేశాల మేరకు రిలీజ్ అయిన 791 ఈవీఎంలతో పాటు రిజర్వు లో ఉన్న 191 కలిపి మొత్తం 990 ఈవీఎంల అనుబంధ ర్యాండమైజేషన్ ను పూర్తి చేశారు. జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు చెప్పారు.