byసూర్య | Thu, May 02, 2024, 05:01 PM
మంచిర్యాల జిల్లాలో బుధవారం వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. బదావతి హటియా అనే వృద్ధుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన గంటన్నరలోనే మరణించిట్లు వైద్యులు తెలిపారు. తాండూరుకు చెందిన తోట రాజవ్వ అనే వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతున్న మృతురాలిని మంచిర్యాలకు తీసుకురాగా బస్సు దిగిన తర్వాత అస్వస్థతకు గురవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందింది.