byసూర్య | Thu, May 02, 2024, 04:50 PM
దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని ఎంనోనిపల్లి, కంసాన్ పల్లి, గన్ముక్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీగా చల్ల వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా పలువురు బిజెపి, బీఎస్పీ, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.