byసూర్య | Thu, Apr 18, 2024, 01:46 PM
నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్లు ఉదయ సముద్రం రిజర్వాయర్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. జిల్లాలోని పలు గ్రామాలకు మంచినీటి అందించే చెరువును సంరక్షణ లేక రోడ్డుపైనే సీసాలు పగలగొట్టం చేరవులో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను వేస్తున్నారు. వీటివల్ల చెరువు కాలుష్యం అవడంతో పాటు నీరు కూడా కలుషితమవుతున్నాయి. ఉదయ సముద్రం సంరక్షణ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని యువకులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.