లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది?

byసూర్య | Tue, Apr 30, 2024, 09:05 PM

మరణం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పటం కష్టం. అప్పటివరకు ఎంతో సంతోషంగా ఉన్న వాళ్లు కూడా కళ్ల ముందే కోడిపిల్లల్లా కూలిపోయి ప్రాణాలు వదులుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. మనిషి జీవితం నీటిబుడగ ప్రయాణం అంటూ చాలా మంది చెప్తుంటారు. ఇంతకు ముందంటే.. మనిషి జీవిత కాలం ఎంతా అంటే వందేళ్లనో.. డెబ్బై సంవత్సరాలనో చెప్పేవాళ్లు.. కానీ ఇప్పుడు అదే ప్రశ్నకు సమాధానం చెప్పటం చాలా కష్టంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలే అందుకు సాక్ష్యం. అయితే.. చాలా మంది అప్పటివరకు ఎంతో యాక్టివ్‌గా ఉండి.. క్షణాల్లో తుదిశ్వాస విడుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఓ యువకుడి విషయంలో జరిగిన ఘటన.. సూపర్ డిలక్స్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని గుర్తు చేస్తోంది.


సమంత నటించిన సూపర్ డిలక్స్ సినిమాలో.. తన ప్రేయసితో ఏకాంతంగా గడిపే సమయంలో యువకుడు ఊహించని విధంగా ప్రాణాలు వదిలేస్తాడు. అచ్చం అలాంటి ఘటనే మహబూబ్‌నగర్‌లో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్ అనే 28 ఏళ్ల యువకుడు వ్యాపారం చేస్తుంటాడు. కాగా.. అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయి, హేమంత్.. గత కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. కాగా.. వీళ్లిద్దరూ 29వ తేదీన హైదరాబాద్‌లోని ఒక ఫంక్షన్‌కి హాజరయ్యారు. ఆ తరువాత ఎస్సార్ నగర్‌లో ఓయో రూమ్ తీసుకున్నారు.


రాత్రి సమయంలో ఇద్దరూ అదే గదిలో ఉన్నారు. కాగా.. గదిలో హేమంత్ మద్యం సేవించగా.. ఆ తర్వాత ఇద్దరు కలిసి భోజనం కూడా చేశారు. కాగా.. సుమారు 2 గంటల ప్రాంతంలో హేమంత్ బాత్రూంకని వెళ్లాడు. వాష్‌రూంలోకి వెళ్లిన హేమంత్ ఎంతసేపటికీ రాకపోవటంతో ఆ అమ్మాయికి డౌట్ వచ్చి.. లోపలికి వెళ్లి చూడగా.. అతను ఆపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. హేమంత్‌ను ఆ పరిస్థితిలో చూసిన అమ్మాయి వెంటనే.. అతని స్నేహితులకి ఫోన్ చేసి విషయం అంతా వివరించగా.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. హేమంత్‌ను బాత్‌రూం నుంచి తీసుకొచ్చి మంచంపై పడుకోబెట్టి.. 108 కి కాల్ చేయగా.. వచ్చిన వైద్య సిబ్బంది పరిక్షించి హేమంత్ చనిపోయినట్టు నిర్దారించారు.


ఈ విషయాన్ని వెంటనే హేమంత్ కుటుంబసభ్యులకు తెలియజేయగా.. తల్లి హేమలత ఇచ్చి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అయితే.. హేమంత్‌.. హార్ట్ ఎటాక్‌తో మరణించాడా.. లేదా ఇంకేదైనా జరిగి ఉంటుందా.. అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మధ్యా ఏమైనా గొడవ గానీ జరిగిందా.. లేదా మద్యం ఎక్కువ మోతాదులో సేవించాడా.. లాంటి కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM