అన్నదాతకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన

byసూర్య | Tue, Apr 30, 2024, 08:05 PM

రైతుబంధు నిధుల కోసం తెలంగాణ అన్నదాత ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొందరి అకౌంట్లలో డబ్బులు జమ కాగా.. మరికొందరి ఖాతాల్లో డబ్బులు పడాల్సి ఉంది. ఇంతలోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రైతుబంధు నిధుల విడుదల ఆగిపోయింది. కోడ్ ఎత్తివేశాక డబ్బులు జమ చేస్తారా? లేదా ? అనే గందరగోళంలో రైతులు ఉన్నారు.


ఈ నేపథ్యంలోనే అన్నదాతకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గుడ్‌న్యూస్ చెప్పారు. రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చామని.. మరో 5 లక్షల మందికి ఇవ్వాల్సి ఉందన్నారు. వారికి కూడా ఎన్నికల కోడ్ పూర్తికాగానే.. రైతు బంధు నిధులు జమ చేస్తామని చెప్పారు. రైతులెవరూ ఆందోళనకు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఖమ్మంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు రైతుబంధుపై క్లారిటీ ఇచ్చారు.


పదేళ్లు కాంగ్రెస్ కార్యకర్తలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కేసులు పెట్టినా ఏనాడు భయపడలేదని అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని.. ఎవరు ఉన్నా లేకపోయినా పదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కార్యకర్తలు గెలిపించారన్నారు. మతం పేరుతో బీజేపీ అన్యాయం చేస్తుందని.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం కోసం ఈ ఎన్నికలు.. జరగుతున్నాయని ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పారు. ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త శ్రమను వృథా కానివ్వమని భట్టి వ్యాఖ్యనించారు.


ఎన్నికల కోడ్ అనంతరం ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. 200 యూనిట్లకు జీరో కరెంట్ బిల్లు అంటే నవ్వారని.. తమ ప్రభుత్వం మాత్రం జీవో ఇచ్చి అమలు చేసిందని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సిరిసిల్ల మగ్గం కార్మికులకు పెండింగ్‌ నిధులును తమ ప్రభుత్వమే చెల్లించిందని.. మహిళా స్వయం సహాయక బృందాలకు సంవత్సరానికి రూ.20 లక్షల కోట్లు ఇస్తామని అన్నారు.


కాగా, ఇదే సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి.. కొంతమంది పార్టీ కోసం పనిచేయట్లేదని అన్నారు. పదవులు కావాలనే వారు పని చేయాలని లేదంటే కష్టమని అన్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టే వారికి పదవులు రావని వ్యాఖ్యనించారు. రేణుక కామెంట్లపై కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతలు సీరియస్ అయ్యారు. ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్నారు, దీంతో సభలో కాసేపు రసాభాస నెలకొంది.



Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM