byసూర్య | Wed, Apr 17, 2024, 11:39 PM
భువనగిరి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆస్పత్రి పాలైన 24 మంది విద్యార్థుల్లో ప్రశాంత్ అనే విద్యార్థి మృతి చెందడం తీవ్ర కలకలం రేపిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల ఎంతో భవిష్యత్తు విద్యార్థి మృతి చెందడం దురదృష్టకరమన్నారు.