సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీభత్సం,,,6 నిమిషాల్లో 6 యాక్సిడెంట్లు

byసూర్య | Wed, Apr 17, 2024, 09:19 PM

మద్యం సేవించి వాహనాలు డ్రైవింగ్ చేయొద్దంటూ పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా.. చాలా మంది పెడచెవిన పెడుతూ తమ ప్రాణాలతో పాటు మిగతావారి జీవితాలను కూడా రిస్క్‌లో పెడుతున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నా.. ఎలాగోలా తప్పించుకుని మద్యం మత్తులో రోడ్డెక్కి అమాయలను ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో పీకలదాకా మద్యం తాగిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. అర్ధరాత్రి వేళ తన కారుతో ఆరు నిమిషాల్లోనే ఆరు యాక్సిడెంట్లు చేసి.. బీభత్సం సృష్టించాడు. ఐకియా నుంచి రాయదుర్గం పోలీస్‌స్టేషన్ సమీపంలోని కామినేని ఆసుపత్రి వరకు ఉన్న మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా.. 11 మంది గాయపడ్డారు.


మొదటి ప్రమాదం అర్థరాత్రి 12 గంటల 45 నిమిషాలకు మైండ్‌స్పేస్ సమీపంలో జరగ్గా.. చివరిది 12.51 గంటలకు జరిగింది. నిజాంపేట ప్రగతినగర్‌కు చెందిన పాతర్ల క్రాంతికుమార్‌ యాదవ్‌ అనే యువకుడు ఆదివారం రాత్రి మద్యం తాగాడు. ఆ మత్తులోనే కారులో బయల్దేరగా.. ఐకియా రోటరీ దగ్గర.. ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అందులోని మహిళ స్వల్పంగా గాయపడింది. భయంతో పారిపోయేందుకు స్పీడ్ పెంచిన క్రాంతికుమార్.. గచ్చిబౌలి బాబూఖాన్‌ లేన్‌ దగ్గర ఓ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒకరి కాలు విరిగిపోగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.


మళ్లీ అక్కడి నుంచి పిస్తా హౌజ్‌ ఎదురుగా నడుస్తూ వెళ్తున్న మరో యువకుడిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని స్ఠానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. వరుసగా యాక్సిడెంట్లు అవుతున్నా.. ఎక్కడా ఆగని క్రాంతికుమార్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్ సమీపంలోని కిమ్స్ ఆస్పత్రి దగ్గర మరో బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా.. కారును మరింత వేగంగా పోనిచ్చి కొద్దిదూరంలోనే ఇంకో బైక్‌ను ఢీకొట్టాడు. అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లే క్రమంలో ఆటోను ఢీకొట్టగా.. అందులోని ముగ్గురు గాయపడ్డారు.


నడిరోడ్డుపై విచక్షణ కోల్పోయి డ్రైవింగ్ చేయడమే కాకుండా.. అనేకమందిని గాయపరిచిన క్రాంతికుమార్‌ను కొందరు యువకులు వెంటాడి మల్కంచెరువు వద్ద అడ్డుకున్నారు. అతడిని కారులో నుంచి బయటకు లాగి దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. నిందితుడిని రాయదుర్గం స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా రీడింగ్ ఏకంగా 550 వచ్చింది. దీంతో.. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి క్రాంతి కుమార్.. మద్యం మత్తులో.. జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ మీదుగా నిజాంపేటకు వెళుతుండగా.. వోక్స్‌వ్యాగన్ పోలోలో మైండ్‌స్పేస్ నుంచి మెహిదీపట్నం రోడ్డుకు వెళ్తుండగా.. మూడు బైకులు, ఒక కారు, ఒక ఆటోతో పాటు పాదచారులను కూడా ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM