byసూర్య | Fri, Apr 12, 2024, 05:20 PM
రైస్ మిల్లుల యజమానులు మిల్లింగ్ లక్ష్యానికి అనుగుణంగా రోజువారీగా సీఎంఆర్ బాయిల్డ్ రైస్ ను మిల్లింగ్ చేయాలని కామారెడ్డి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీ. వెంకటరమణ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్ ను శుక్రవారం సందర్శించారు. లక్ష్యం మేరకు మిల్లింగ్ చేయకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జేసీ వెంట, డీటీసీఎస్, రైస్ మిల్ యజమాని ముత్యపు సుదర్శన్ వున్నారు.