అదానీ ఫౌండేషన్ తరఫున ఈ మొత్తాన్ని అందించిన అదానీ గ్రూప్ అధినేత

byసూర్య | Fri, Oct 18, 2024, 07:56 PM

అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందించారు. అదానీ ఫౌండేషన్ తరఫున ఈ మొత్తాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.యువతలో నైపుణ్యం పెంచేలా రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలోని బేగరికంచెలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ స్కిల్ యూనివర్సిటీలో 17 రకాల కోర్సుల్లో యువతకు శిక్షణను ఇచ్చి ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ప్రతి ఏడాది లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా రానున్న కాలంలో ఈ యూనివర్సిటీని విస్తరించనున్నారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవనంలో వర్సిటీ కార్యకలాపాలు కొనసాగుతాయి.


Latest News
 

ప్రపంచ హస్ పైస్,పాలియేటివ్ కేర్ దినోత్సవం Fri, Oct 18, 2024, 09:53 PM
ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్లు,,,,త్వరలోనే గ్రేటర్ వ్యాప్తంగా అమలు Fri, Oct 18, 2024, 09:53 PM
ఘనంగా కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 16వ వర్ధంతి వేడుకలు Fri, Oct 18, 2024, 09:50 PM
మియాపూర్‌ మెట్రో వద్ద చిరుత.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు Fri, Oct 18, 2024, 09:49 PM
ఆసుపత్రులలో అవసరమైన పరికరాల ప్రతిపాదనలు రూపొందించాలి Fri, Oct 18, 2024, 09:38 PM