స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం

byసూర్య | Fri, Oct 18, 2024, 08:50 PM

దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తోన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళం ప్రకటించారు. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఫౌండేషన్ ద్వారా రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూ.100 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును శుక్రవారం హైదరాబాద్‌లో అందజేశారు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది.


'అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో శుక్రవారం కలిశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రకటించిన రూ.100 కోట్ల చెక్కును అందజేశారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఈ గొప్ప ప్రయత్నానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా అదానీ హామీ ఇచ్చారు.' అని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతకుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఆయన ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగుతారని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర యువతకు నైపుణ్యాలు నేర్పించేలా రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్ల, బేగరికంచె ప్రాంతంలో ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం చేపడుతోంది ప్రభుత్వం. మొత్తం 17 రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ప్రతి ఏడాది లక్ష మందికిపైగా శిక్షణ ఇచ్చేలా రానున్న రోజుల్లో ఈ స్కిల్ యూనివర్సిటీని విస్తరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవంతిలో ఈ స్కిల్ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.


Latest News
 

మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM
జిల్లా గ్రంధాలయాల చైర్మన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న స్పీకర్ Fri, Oct 18, 2024, 10:38 PM