byసూర్య | Fri, Apr 12, 2024, 05:18 PM
బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్, పోతంగల్, కోటగిరి మండలాల్లో అకాల వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను శుక్రవారం మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న పంటలను గుర్తించి రైతులకు ఎకరాకు 25000 వేల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.