byసూర్య | Fri, Apr 12, 2024, 05:17 PM
కాంగ్రెస్ ప్రభుత్వం మలిదశ ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కృషి చేయాలని రాష్ట్ర మలిదశ ఉద్యమకారుల గౌరవ అధ్యక్షుడు గజ్జలకాంతంకు శుక్రవారం మాసాని శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమకారులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మాసాని శేఖర్ రెడ్డి, ఉడుతా గంగాధర్ గుప్తా, చంద్రశేఖర్, దండు విజయ్ కుమార్, కృష్ణ, సాయిబాబా పాల్గొన్నారు.