byసూర్య | Fri, Apr 12, 2024, 05:15 PM
మద్నూర్ కు చెందిన ఓ బాలిక స్థానిక వసతి గృహంలో ఉంటూ 9వ తరగతి చదువుకుంటోంది. 2 నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన ఓ అబ్బాయి (30)తో ఆ బాలికకు కుటుంబ సభ్యులు వివాహం నిశ్చయించారు. దీంతో బాలిక పెళ్లి వద్దని తాను చదువుకుంటానని ఎంత చెప్పినా తల్లి వినలేదు. దీంతో బాలిక గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించి కన్నీరు పెట్టుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులను పిలిపించి వివరాలు సేకరించారు.