byసూర్య | Fri, Mar 29, 2024, 10:32 AM
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని గురువారం తెలంగాణ ఐజిపి రమేష్ రెడ్డి ఐపీఎస్ వారు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముందుగా వారికి ఆలయం మర్యాదలతో స్వాగతం తెలిపి, దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.