byసూర్య | Fri, Mar 29, 2024, 10:26 AM
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఈ సీజన్లో తొలిసారిగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం నిర్మల్ జిల్లాలో 43.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఒక జిల్లాలో 43 డిగ్రీలు, 13 జిల్లాల్లో 42, 12 జిల్లాల్లో 41, 7 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటాయి. రానున్న నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు మరో మూడు డిగ్రీల వరకు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. శనివారం 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు నాటికి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కుకు చేరుకునే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.