byసూర్య | Fri, Mar 29, 2024, 10:19 AM
కేసీఆర్ ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని విజయశాంతి ట్వీట్ చేశారు. కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న తరుణంలో విజయశాంతి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. టీఆర్ఎస్ తొలి ప్రధాన కార్యదర్శి, నేటి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విజయశాంతిని కారణం చెప్పకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఇయ్యాలటి బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు మాట్లాడుతూ.. ఆత్మగౌరవం దృష్ట్యా పార్టీకి దూరం అవుతారనే వార్తలు వచ్చాయన్నారు. తప్పు జరిగిందా, అందరూ ఎందుకు దూరమవుతున్నారు, రోజురోజుకు కేసీఆర్ తన ప్రాభవాన్ని ఎందుకు కోల్పోతున్నారో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని విజయశాంతి సూచించారు.