byసూర్య | Fri, Mar 29, 2024, 10:47 AM
బీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు(కేకే) త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. రేవంత్ తో సమావేశమై పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా కేకే కూతురు హైదరాబాద్ బేయర్ గద్వాల విజయ కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. కాగా గురువారం కేకే మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయి కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు తేల్చి చెప్పారు.
'కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. కేసీఆర్పై తనకు కూడా గౌరవం ఉందని అయితే కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇదే విషయాన్ని తాను కేసీఆర్కు చెప్పానని చెప్పారు. కవిత అరెస్ట్ గురించి కూడా చర్చించాం' అని వివరించారు. కేకే రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.