byసూర్య | Sun, Apr 28, 2024, 12:01 PM
గడిచిన ఎన్నికల్లో మార్పు కావాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలని పార్టీ శ్రేణులు కోరుకుని తమను గెలిపించడం ద్వారా గత పాలకుల చెంప చెల్లుమనిపించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్యకర్తల చలువతోనే కేబినెట్ లో జిల్లా నుంచి ముగ్గురికి పదవులు దక్కాయని చెప్పారు. ఆదివారం ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.