byసూర్య | Sun, Apr 28, 2024, 12:03 PM
అధిష్టానం అనేక చర్చల అనంతరం అందరికి కావాల్సిన రామ సహాయం రఘురాంరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా అక్షింతలు, దీపాలతో కాలం వెళ్లబుచ్చిన బీజేపీని గద్దెదించి రాహుల్ ను ప్రధానిగా చేసేందుకు రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరారు. గత పాలకులు అన్ని రంగాలను భ్రష్టు పట్టించిందన్నారు.